యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
జేడీఎస్ మద్దతు కోసం దేవెగౌడతో మాట్లాడిన ప్రధాని
బెంగుళూరు (ఏజెన్సీ), శుక్రవారం, 18 జులై 2008   ( 15:37 IST )
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడతో టెలిఫోన్‌లో మాట్లాడారు. లోక్‌సభలో ఈ నెల 22న జరగబోతున్న విశ్వాసపరీక్షలో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్ జేడీఎస్ నేతను కోరారు.

జేడీఎస్‌కు ముగ్గురు ఎంపీల బలం ఉంది. శుక్రవారం ఉదయం తమ పార్టీ అధ్యక్షుడు దేవెగౌడకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫోన్ చేశారని జేడీఎస్ ప్రతినిధి వైఎస్‌వీ దత్తా విలేకరులతో చెప్పారు. విశ్వాసపరీక్షలో యూపీఏకు మద్దతివ్వాలా వద్దా అనే దానిపై జేడీఎస్ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోని సంగతి తెలిసిందే.

తాజాగా ప్రధాని మన్మోహన్ తానే స్వయంగా దేవెగౌడకు ఫోన్ చేసి మద్దతు కోరారు. దీనిపై దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరివైపుకు చేరే ప్రసక్తే లేదని, ఈ రెండు పార్టీల వలన తాము తీవ్రంగా నష్టపోయామని దేవెగౌడ ఇంతకుముందు ఓ సందర్భంగా వ్యాఖ్యానించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎంపీలకు సీపీఎం విప్: సోమనాథ్‌కు మినహాయింపు
దేరా- సిక్కుల మధ్య ఘర్షణ: పంజాబ్‌లో అప్రమత్తత
పీఎం స్కామ్‌: కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించం: బీజేపీ
శిక్షలు పడ్డ ఎంపీలను ఆశ్రయిస్తున్న కాంగ్రెస్: సీపీఎం
మాకెవరి సర్టిఫికేట్లు అవసరం లేదు: లెఫ్ట్‌తో సోనియా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...