|
| కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించం: బీజేపీ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 18 జులై 2008 ( 10:05 IST ) | |
కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం ఈ నెల 22న జరిగే విశ్వాసపరీక్షలో ఓడిపోతే తాము ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించబోమని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ఈ పరిస్థితులు ఏర్పడితే ఎన్నికలకు వెళ్లడమే సరైన పరిష్కారం అని అభిప్రాయపడింది.
అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇటీవల లెఫ్ట్ పార్టీలు తమ కీలక మద్దతును ఉపసంహరించడంతో యూపీఏ కూటమి ప్రభుత్వం 22న బలపరీక్షను ఎదుర్కోబోతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ బలపరీక్షలో యూపీఏ ఓడిపోతే ప్రతిపక్ష ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించదని బీజేపీ తెలిపింది. తమకు సంఖ్యాబలం ఉన్నప్పటికీ ఇందుకోసం ప్రయత్నించమని బీజేపీ పేర్కొనడం గమనార్హం. యూపీఏ గట్టెక్కని పక్షంలో ప్రజాతీర్పును కోరతామని బీజేపీ నేత ఎం వెంకయ్యనాయుడు గురువారం విలేకరులతో చెప్పారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|