|
| జైపూర్ పేలుళ్లు: హుజీ ప్రమేయంపై అనుమానాలు
|
| న్యూఢిల్లీ/ జైపూర్ (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008 ( 13:18 IST ) | |
జైపూర్ నగరాన్ని మంగళవారం రాత్రి అట్టుడికించిన వరుస బాంబు పేలుళ్ల వెనుక బంగ్లాదేశ్కు చెందిన హుజీ (హెచ్యూజేఐ) తీవ్రవాద సంస్థ హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా హుజీకి సంబంధించిన స్లీపర్ సెల్స్ ఉన్నట్టు ఎప్పటినుంచో బలమైన అనుమానాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా జైపూర్లో జరిగిన బాంబు పేలుళ్లలో కూడా హుజీ ప్రమేయం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి శివరాజ్ పాటిల్ తన పర్యటనను కుదించుకొని రాజధానికి చేరుకున్నారు.
ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి సంభవించిన ఈ బాంబు పేలుళ్ల కోసం తీవ్రవాదులు ఆర్డీఎక్స్ ఉపయోగించినట్టు రాజస్థాన్ హోంశాఖ మంత్రి గులాబ్ చంద్ కటారియా బుధవారం తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక ఈ విషయాన్ని ధృవీకరించిందని వెల్లడించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|