|
| బాంబు పేలుళ్లు: జైపూర్ నగరంలో కర్ఫ్యూ విధింపు
|
| జైపూర్ (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008 ( 11:59 IST ) | |
జైపూర్ నగరంలో 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం కర్ఫ్యూ విధించారు. మంగళవారం రాత్రి జైపూర్ నగరం ఎనిమిది వరుస బాంబు పేలుళ్లతో అట్టుడుకిన సంగతి తెలిసిందే. ఈ బాంబు పేలుళ్లలో 60 మంది మృతి చెందగా, సుమారు 200 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు నగరంలో కర్ఫ్యూ విధించారు.
జైపూర్ జిల్లా కలెక్టర్ అఖిల్ అరోరా ముందస్తు జాగ్రత్త చర్యగా కర్ఫ్యూ విధించామని చెప్పారు. ఈ కర్ఫ్యూ బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. పోలీసు శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ కన్హియా లాల్ 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కర్ఫ్యూ విధించినట్టు వెల్లడించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|