యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
శాంతికి భంగం కలిగించేందుకు జరిగిన కుట్ర: రాజే
జైపూర్ (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008   ( 11:41 IST )
జైపూర్‌లో మంగళవారం రాత్రి జరిగిన వరుస బాంబు పేలుళ్లను రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు తీవ్రవాదులు పన్నిన కుట్ర అని వసుంధర రాజే పేర్కొన్నారు.

జైపూర్ బాంబు పేలుళ్లపై విలేకరుల సమావేశంలో రాజే మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఈస్థాయి తీవ్రవాద దాడి మునెప్పన్నడూ జరలేదని రాజే తెలిపారు. ఇది రాజస్థాన్‌పై జరిగిన దాడి కాదని, దేశంపై జరిగిన దాడి అని రాజే అభిప్రాయపడ్డారు.

ఈ కష్టసమయంలో అన్ని రాజకీయ పార్టీలన్నీ తమకు అండగా నిలవాలని, పరిస్థితిని చక్కదిద్దేందుకు సహకరించాలని వసుంధర రాజే కోరారు. జైపూర్‌ బాంబు పేలుళ్లు 60 మంది అమాయకలు ప్రాణాలు బలితీసుకున్న సంగతి తెలిసిందే.

అంతకుముందు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, హోం మంత్రి శివరాజ్‌పాటిల్ ఈ దుర్ఘటనపై రాజేతో మాట్లాడారు. కేంద్ర అన్నిరకాలుగా బాంబు పేలుళ్లు బాధితులను ఆదుకుంటుందని వారు హామీ ఇచ్చారు. పోలీసులకు సాయం చేసేందుకు కేంద్రం పంపిన జాతీయ భద్రత దళ సిబ్బంది ఇక్కడకు వచ్చారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాజస్థాన్ రాజధాని పేలుళ్లకు రాష్ట్రపతి, ప్రధాని ఖండన
జైపూర్ పేలుళ్లు: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
జైపూర్‌లో బాంబు పేలుళ్లు: 60 మందికిపైగా మృతి
కర్ణాటకలో మాకు స్పష్టమైన మెజారిటీ ఖాయం: బీజేపీ
మొదటిసారి క్షిపణి ప్రాజెక్టుకు మహిళ నేతృత్వం
కేంద్ర ప్రభుత్వం నివేదిక కోరలేదు: ప.బెంగాల్ ప్రభుత్వం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace