|
| నందిగ్రామ్లో టీసీ, బీయూపీసీ మద్దతుదారులపై లాఠీఛార్జి |
| నందిగ్రామ్ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008 ( 17:00 IST ) | |
పశ్చిమబెంగాల్లో ఆదివారం పంచాయితీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నందిగ్రామ్ మరోసారి హింసాకాండ కేంద్రంగా మారింది. బీడీవో కార్యాలయం నుంచి ఎన్నికల సామాగ్రిని తీసుకొని బయటకు వస్తున్న ట్రక్కును తృణమూల్ కాంగ్రెస్, భూసేకరణ వ్యతిరేక పోరాట సమితి (బీయూపీసీ) మద్దతుదారులు అడ్డుకున్నారు. దీంతో వారిపై రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది లాఠీఛార్జి చేశారు.
స్వగ్రామాల నుంచి బయటకు పంపివేసిన కారణంగా ఆదివారం జరిగే ఎన్నికల్లో తాము ఓటు వేయలేమని టీఎంసీ, బీయూపీసీ కార్యకర్తలు ఈ ట్రక్కును అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా వారిపై జరిపిన లాఠీఛార్జిని పోలీసులు సమర్థించుకున్నారు. తమ కర్తవ్యాన్ని పోలీసులు నిర్వహించారని నందిగ్రామ్ పోలీసు ఇన్ఛార్జి దెబాషిశ్ చక్రవర్తీ తెలిపారు. పోలీసుల లాఠీఛార్జిలో ఓ జర్నలిస్ట్ కూడా గాయపడ్డారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|