|
| అణు ఒప్పందంలో ఇబ్బందులను రైస్కు చెప్పిన ముఖర్జీ
|
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008 ( 16:22 IST ) | |
పౌర అణు ఒప్పందం అమల్లోకి రావడానికి ఉన్న ఇబ్బందులను విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కండొలిజా రైస్కు వివరించారు. ఈ ఒప్పందం అమల్లోకి తేవడంపై లెఫ్ట్ పార్టీల నుంచి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
పౌర అణు ఒప్పందంపై కండొలిజా రైస్తో శుక్రవారం రాత్రి ప్రణబ్ ముఖర్జీ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం దీనికున్న ఇబ్బందులను రైస్కు తెలియజేశారు. అమెరికా ఈ ఒప్పందం సాధ్యమైనంత త్వరగా అమల్లోకి రావాలని కోరుకుంటుందని రైస్ తెలిపారు.
ఈ ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చేవిధంగా భారత్ ఇప్పటివరకు సాధించిన పురోభివృద్ధిని రైస్ ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీని అడిగి తెలుసుకున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|