|
| క్రిట్టినన్ హత్యకేసు నుంచి అళగిరికి విముక్తి |
| చిత్తూరు (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008 ( 10:18 IST ) | |
తమిళనాడు మాజీ మంత్రి క్రిట్టినన్ హత్యకేసు నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు అళగిరికి విముక్తి లభించింది. ఈ కేసు నిరూపణలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో సెషన్స్ కోర్టు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మే 20 2003న జరిగిన క్రిట్టినన్ హత్య కేసు విచారణను జిల్లా సెషన్స్ న్యాయస్థానం చేపట్టింది. అళగిరి, మదురై డిప్యూటీ మేయర్ మన్నన్ సహా మరో 11 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
ఇరవై రోజులపాటు సాగిన విచారణలో మొత్తం 82 మంది సాక్షులను విచారించారు. కాగా ప్రాసిక్యూషన్ వాదనను నిరూపించలేకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ తీర్పు ఇచ్చారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|