|
| ఎయిమ్స్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్
|
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008 ( 17:11 IST ) | |
ప్రముఖ వైద్యుడు పి.వేణుగోపాల్ గురువారం ప్రతిష్టాత్మక ఎయిమ్స్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు. ఆయనను ఎయిమ్స్ డైరెక్టర్ బాధ్యతల్లో పునర్నియమించాలని, ఆయనను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎయిమ్స్ డైరెక్టర్ బాధ్యతలను వేణుగోపాల్ మళ్లీ స్వీకరించారు. కేంద్ర మంత్రి అన్బుమణి రాందాస్తో వేణుగోపాల్ సాగించిన పోరులో ఆయన వెంట నిలిచిన ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్లు, ఇతర సిబ్బంది సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.
ఎయిమ్స్ డైరెక్టర్గా వేణుగోపాల్ 2003, జులై 3న బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగాల్సి ఉండగా ఐదు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద చట్టం తీసుకువచ్చి వేణుగోపాల్ను తప్పించింది. ఆయన పదవీకాలం ఈ ఏడాది జులై రెండుతో ముగియనుంది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|