|
| ధరలు ఆరు వారాల్లో కిందకు దిగుతాయి: సిబాల్
|
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008 ( 13:54 IST ) | |
నిత్యావసర వస్తువుల ధరలు ఆరు వారాల్లో తగ్గుతాయని కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. ప్రభుత్వం ధరలను నియంత్రించేందుకు అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు. ఈ చర్యల ద్వారా ఆరు వారాల్లో నిత్యావసర వస్తువులు అదుపులోకి వస్తాయని అన్నారు.
కాంగ్రెస్ ప్రతినిధిగా సిబాల్ విలేకరులతో మాట్లాడుతూ ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాల్సి ఉందన్నారు. అక్రమ నిల్వదారులు, నల్లబజారు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట పరచాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
ధరల పెరుగుదలపై ప్రతిపక్ష బీజేపీ నిర్మాణాత్మక ఆలోచనలతో ముందుకురావాలని అన్నారు. ఆకలి రాజకీయాలతో కాకుండా బీజేపీ ధరల నియంత్రణపై సరైన సలహాలు ఇవ్వాలన్నారు. ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ప్రదేశ్, ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ ఈ తరహా రాజకీయాలనే అనుసరిస్తుందని సిబాల్ ఆరోపించారు. బీజేపీ ఆకలితో రాజకీయాలు చేస్తుందని విమర్శించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|