యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
బాగ్దాద్‌లో బాంబు పేలుడు: 34మంది మృతి
బాగ్దాద్ (ఏజెన్సీ), గురువారం, 21 మే 2009   ( 13:09 IST )
బాగ్దాద్‌లోని వాయువ్య ప్రాంతంలో శక్తివంతమైన కారు బాంబు పేలడంతో దాదాపు 34మంది మృతి చెందగా, 72మంది తీవ్రగాయాలకు గురైనారు. ఈ కారు బాంబు పేలుడు పట్టణంలోని వాయువ్య ప్రాంతంలోనున్న శులా క్షేత్రంలో జరిగినట్టు అంతరంగిక భద్రతా శాఖాధికారి ఒకరు తెలిపారు.

ఈ విషయమై సదరు అధికారి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో షియా జాతికి చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారని, ప్రస్తుతం ఇక్కడ జరిగిన దాడి గత నెల 29వ తేదీ జరిగినదానికన్నా పెద్దదని తెలిపారు. గత నెల 29వ తేదీ జరిగిన దాడి సందర్భంగా 50 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే.

తాజాగా కారు బాంబు పేలుడు జరిగిన ప్రాంతం చాలా రద్దీగా ఉంటుందని, ఇక్కడ పెద్ద, పెద్ద దుకాణాలు, రెస్టారెంట్లు ఎక్కువగా ఉంటాయని ఆ అధికారి తెలిపారు. ఇలాంటి జన సమర్ధం కలిగిన ప్రాంతంలో పేలుడు పదార్థాలతో నిండిన కారును పార్క్ చేసి ఉంచారని ఆ అధికారి తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చర్చల పునరుద్ధరణపై క్లింటన్ ఆశాభావం
ప్రధాని మన్మోహన్‌కు ఒబామా ప్రశంసలు
పాక్ అణ్వాయుధాలపై బరాక్ ఒబామా ఆందోళన
నూయార్క్‌లో దాడులకు కుట్ర: నలుగురి అరెస్ట్
కొత్త తరహా క్షిపణి పరీక్ష నిర్వహించిన ఇరాన్
అణు సామర్థ్యం పెంచుకుంటున్న పాకిస్థాన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...