యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ఇండోనేషియాలో విమాన ప్రమాదం: 68మంది మృతి
జకార్తా (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009   ( 10:06 IST )
ఇండోనేషియాలో సైనిక విమానం కూలిపోయిన ఘటనలో కనీసం 68మంది మృతి చెందారు. మొత్తం 100మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం కూలిపోయిన నేపథ్యంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో అనేకమంది మృతి చెంది ఉండవచ్చని స్థానిక టెలివిజన్‌లు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం రంగంలో దిగిన సైనికులు మృత దేహాలను, క్షతగాత్రులను అక్కడినుంచి తరలిస్తుండగా వారిలో చాలామంది పూర్తిగా కాలిపోయారని ఆ ఛానెల్స్ పేర్కొంటున్నాయి. ఈ విషయమై ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ సి-130 హెర్కులస్ అనే పేరుగల ఈ విమానం 112మంది ప్రయాణీకులు, సిబ్బందితో సహా ప్రయాణిస్తూ తూర్పు జావా ప్రావీన్స్ వద్దగల ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద కూలిపోయిందని తెలిపారు.

ఈ విమానం కూలిన ప్రాంతంలో ఉన్న నాలుగు ఇళ్లు సైతం అగ్నికి ఆహుతయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై స్థానికుడొకరు మాట్లాడుతూ విమానం కూలిపోయిన సమయంలో పెద్దస్థాయిలో మంటలు వచ్చినట్టు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తమిళులకు సమాన హక్కులు: రాజపక్స హామీ
పాక్‌లో ప్రస్తుత సంక్షోభానికి అమెరికా కారణం
ఎల్టీటీఈ అధినేత పెద్దపులి మృతదేహం గుర్తింపు
శ్రీలంకలో యుద్ధ విజేతలం మేమే: రాజపక్స
పాక్ ఐఎస్ఐకి వ్యూహాత్మక రక్షణగా తాలిబాన్లు
స్వాత్ లోయలో 27 మంది తాలిబాన్ల హతం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...