యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
పాక్‌లో కారుబాంబు పేలుడు: 10మంది మృతి
పెషావర్ (ఏజెన్సీ), శనివారం, 16 మే 2009   ( 16:42 IST )
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో శనివారం జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో ఇద్దరు పిల్లలతో సహా పదిమంది మృతి చెందారు. పెషావర్‌లో ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఈ కారుబాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలోని తాలిబన్ తీవ్రవాదులతో పాక్ సేనలు పోరాటం జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించడం గమనార్హం.

కాక్సల్ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో నిండిన కారు పేలడం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు సంభవించిన సమయంలో ఆ ప్రాంతంలో జనసమర్థంగా ఉండడంతో మృతుల సంఖ్య భారీగా చోటు చేసుకుంది. ఓ సైబర్ కేఫ్ ముందు నిలబెట్టిన ఈ కారు పేలిన కారణంగా ఆ సైబర్ కేఫ్ సైతం భారీగా ధ్వంసమైంది.

ఇక ఈ పేలుడు సంభవించిన ప్రాంతంలో చిన్న పిల్లల స్కూలు బస్సు సైతం ఉండడంతో అందులోని చాలామంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుకు సంబంధించి ప్రస్తుతానికి ఏ సంస్థకూడా తామే చేసినట్టుగా ప్రకటించలేదు. ప్రస్తుతం పేలుడు జరిగిన ప్రాంతంలో రంగంలో దిగిన అధికారులు బాధితులను ఆదుకునే పనిలో నిమగ్నమయ్యారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
స్వాత్ పట్టణంలో సైనిక చర్యకు సిద్ధమైన పాక్
పాక్‌లో అమెరికా డ్రోన్ దాడి: 12 మంది మృతి
స్వైన్ ఫ్లూతో అమెరికాలో ఐదో మరణం
భారతీయునికి గ్రీన్ ఆస్కార్ పురస్కారం
తాలిబన్ తీవ్రవాదులను ఓడించగలం: గిలానీ
48 గంటల్లో ప్రజలు తప్పించబడుతారు: లంక
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి నుంచి కొత్త చిత్రం
కుర్‌కురే ఫేం ఇంద్ర హీరోగా, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమి ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. అన్నపూర్ణ...
జూన్‌లో రానున్న అదే నువ్వు- అదే నేను
విడుదలైన గోపి గోపిక గోదావరి ఆడియో
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...