|
| 26/11 సాక్ష్యాలపై విశ్వసనీయ దర్యాప్తు: పాకిస్థాన్ |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 7 జనవరి 2009 ( 18:09 IST ) | |
ముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించి భారత్ అందజేసిన సాక్ష్యాలు సరిపోవని, వాటిలో విశ్వసనీయత లేదని మంగళవారం పాక్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. భారత్ అందించిన సాక్ష్యాలను తోసిపుచ్చిన పాక్ అధికార యంత్రాంగం, తాజాగా ఈ సాక్ష్యాలపై విశ్వసనీయ దర్యాప్తు జరుపుతామని వెల్లడించింది.
భారత్ అందించిన సాక్ష్యాలపై దర్యాప్తు జరపాలని పాకిస్థాన్ నేతలు కోరుకుంటున్నట్లు పాక్ దినపత్రిక ఒకటి బుధవారం పేర్కొంది. పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి యుసఫ్ రజా గిలానీ మంగళవారం ప్రాంతీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్ అందించిన సాక్ష్యాలపై విశ్వసనీయ దర్యాప్తు జరిపించాలని వారు నిర్ణయించినట్లు డైలీ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|