యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
మళ్లైతీవు సమీపంలోకి లంక సేనలు
కొలంబో (ఏజెన్సీ), సోమవారం, 5 జనవరి 2009   ( 10:24 IST )
తమిళ వేర్పాటువాద సంస్థ ఎల్టీటీఈకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఎల్టీటీఈ అధినేత ప్రభాకర్‌ను పట్టుకోవడమే లక్ష్యంగా రంగంలో దిగిన శ్రీలంక సైన్యం ఆ దిశగా చెప్పుకోదగ్గ పురోగతి సాధించింది. దీంతో రెండు రోజుల క్రితం పులలకు పట్టున్న కిళినోచ్చి సైన్యం వశం కాగా ప్రస్తుతం మళ్లైతీవును సైతం జయించేందుకు సైన్యం ముందుకు కదులుతోంది.

ప్రభాకరన్‌తో సహా ఇతర ముఖ్య నేతలు తలదాచుకునే అవకాశముందని భావిస్తున్న మళ్లైతీవు వైపు సాగుతున్న సైన్యం ఆదివారం నాటికి కీలకమైన ఒడుసుదన్ పట్టణాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంది. ఎల్టీటీఈ దళాలు ఈ పట్టణం ద్వారానే మళ్లైతీవులోని తమ వారికి అవసరమైన వస్తువులను చేరవేయడం జరుగుతోంది.

భూతలంపై సైన్యాలు ముందుకు చొచ్చుకుపోతుండగా అదేసమయంలో శ్రీలంక వాయు సేన సైతం బాంబుల వర్షం కురిపిస్తూ టైగర్లను గుక్క తిప్పుకోకుండా చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీలంక సైనిక వర్గాలు మాట్లాడుతూ మళ్లైతీవు తమ స్వాధీనంలోకి వచ్చేదాకా పోరు ఆపబోమని అన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇండోనేషియా భూకంపం: నలుగురు మృతి
బంగ్లా అధ్యక్షుడిగా జిల్లూర్ రహ్మాన్: హసీనా
దాడులు పునరావృతమైతే పాక్ భారీ మూల్యం
లక్ష ఉద్యోగాల కోసం బ్రౌన్ ప్రణాళిక
గాజాలో భూతల దాడులకు ఇజ్రాయెల్ శ్రీకారం
కిళినోచ్చిపై పట్టు అపూర్వ విజయం: రాజపక్సే
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సంక్రాంతి కానుకగా ఛార్మి 16 డేస్
అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...
జనవరి 1న సత్యం ఐపీఎస్
దాసరిచే మస్కా ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...