|
| దాడులు పునరావృతమైతే పాక్ భారీ మూల్యం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 4 జనవరి 2009 ( 13:14 IST ) | |
భారత్లో ముంబై తరహా దాడులు పునరావృతమైతే పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హోం మంత్రి చిదంబరం హెచ్చరించారు. ఈ తరహా దాడులకు తమ భూభాగం ఉపయోగించబడదన్న గట్టి హామీలను పాక్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడి పాలకుల సహకారం లేకుండా ఈ తరహా దాడులు జరిగే అవకాశం లేదని చెప్పారు.
ఢిల్లీలో ఆయన ఓ ప్రైవేటు టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్పై దాడులకు తమ భూభాగం, వనరులు ఉపయోగించేందుకు ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తులను అనుమతించబోమని అక్కడ అధికారంలో ఉన్న వారి నుంచి తమకు గట్టి హామీ కావాలన్నారు.
అక్కడి ప్రభుత్వం, సైనిక పాలకులనుంచి ఉమ్మడిగా ఈ హామీలను కోరుతున్నామని చెప్పారు. ఇవి కేవలం కాగిత ప్రతులుగా ఉండవని, అంతర్జాతీయ సమాజానికి వీటిని ఇవ్వాలని తెలిపారు. మరోసారి పునరావృతమైతే పాక్ చెల్లించే మూల్యం భారీగానే ఉంటుందని హెచ్చరించారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|