|
| టిబెట్ వివాదం: భారత్ సాయం కోరిన దలైలామా |
| ధర్మశాల (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 12:53 IST ) | |
భారత్, టిబెట్ ప్రాంతాల మధ్య ఉన్న సంబంధాన్ని "గురు- శిష్య బంధం"గా అభివర్ణించిన దలైలామా గురువారం టిబెట్ సమస్య పరిష్కారం కోసం భారత్ సాయాన్ని కోరారు. శిష్యుడు సమస్యల్లో ఉంటే, దాని నుంచి అతడిని రక్షించాల్సిన బాధ్యత గురువుపై ఉంటుందని దలైలామా వ్యాఖ్యానించారు. టిబెట్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్ చొరవ చూపాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రవాసంలో ఉన్న టిబెటియన్లు పాల్గొంటున్న భారీ సమావేశానికి దూరంగా ఉండాలని తాను నిర్ణయించుకోవడంపై దలైలామా మాట్లాడుతూ.. ఈ సమావేశంలో పాల్గొంటే టిబెట్ సమస్యపై ఏదో ఒకటి మాట్లాడాలి. ఇందులో పాల్గొనేవారు ఈ అంశంపై వ్యక్తీకరించే అభిప్రాయాలు తాను చేసే ప్రకటనలతో ప్రభావితం అవతాయి. అందువలనే నవంబరు 17 నుంచి 22 వరకు జరిగే సమావేశానికి దూరంగా ఉన్నానని చెప్పారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|