యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
అమెరికా దాడులకు పాకిస్థాన్ తీవ్ర ఖండన
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008   ( 12:02 IST )
తమ భూభాగంలో అమెరికా వైమానిక దళానికి చెందిన మానవరహిత యుద్ధ విమానాలు జరుపుతున్న క్షిపణి దాడులపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాక్ భూభాగంలో గత కొంతకాలంగా అమెరికా క్షిపణి దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ మాట్లాడుతూ ఇటువంటి దాడులను ఏమాత్రం ఉపేక్షించదగినవి కాదని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే స్థానిక తాలిబాన్ తీవ్రవాదులు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు మరోసారి క్షిపణి దాడులు జరిపితే తాము ప్రతికార చర్యలు చేపడతామని హెచ్చరించారు.

సమస్యాత్మక బాన్ను జిల్లాలో గురువారం జరిగిన అమెరికా క్షిపణి దాడిలో అల్ ఖైదా కీలక నేతతోపాటు ఆరుగురు మృతి చెందారు. దీనిపై అమెరికా దౌత్యాధికారికి పాకిస్థాన్ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.

అమెరికా సేనల ఇటువంటి దాడులతో పాకిస్థాన్ సార్వభౌమత్వాన్ని ధిక్కరిస్తున్నాయని పేర్కొంది. ఈ దాడులను తక్షణం నిలిపివేయాలని పాకిస్థాన్ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
త్వరలో భారత్, రష్యా సంయుక్త యుద్ధవిన్యాసాలు
పైరేట్లకు మూకుతాడు వేసేందుకు భారత్ ప్రణాళికలు
థాయ్ ప్రధాన కార్యాలయం వెలుపల గ్రెనెడ్ దాడి
పైరేట్లకు 30 మిలియన్ డాలర్ల ముడుపులు: ఐరాస
స్వలింగ వివాహాలకు నేపాల్ సుప్రీం ఆమోదం
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు: బంగ్లా ప్రభుత్వం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...