|
| 2025 నాటికి భారత్ కీలక శక్తి: ఎన్ఐసీ నివేదిక |
| న్యూయార్క్ (ఏజెన్సీ), గురువారం, 20 నవంబర్ 2008 ( 12:32 IST ) | |
2025 నాటికి భారత్ ప్రపంచంలో కీలక శక్తిగా ఎదుగుతుందని అమెరికాకు చెందిన నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ (ఎన్ఐసీ) నివేదిక వెల్లడించింది. ఆ సమయానికి అమెరికా ఆర్థిక, మిలటరీ ఆధిపత్యంపై బహుళధృవ ప్రపంచం ఏర్పడుతుందని ఈ నివేదిక అభిప్రాయపడింది. వాషింగ్టన్ టైమ్స్ వెల్లడించిన ఈ నివేదిక వివరాలు వెల్లడించింది.
దీని ప్రకారం చైనా జనాభా సంఖ్యను 2025నాటికి భారత్ అధిగమిస్తుంది. భారత్, చైనా, రష్యా, ఇండోనేషియా, ఇరాన్, టర్కీ దేశాలు ఆ సమయానికి అంతర్జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించగలవని ఈ నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే 2009- 2025 మధ్యకాలంలో ప్రపంచ జనాభా 1.2 బిలియన్లు (6.8 బిలియన్ల నుంచి 8 బిలియన్లు) పెరుగుతుందని వెల్లడించింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|