|
| ఇండోనేషియాలో తీవ్ర భూకంపం: ఇద్దరి మృతి |
| జకార్తా (ఏజెన్సీ), సోమవారం, 17 నవంబర్ 2008 ( 16:57 IST ) | |
ఇండినేషియా తూర్పు ప్రాంతంలో సోమవారం వేకువజామున తీవ్ర భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా ఇద్దరు మృతి చెందారు. అంతేకాకుండా వందలాది గృహాలు ధ్వంసం అయ్యాయి. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతంలో సునామీ హెచ్చరిక కూడా జారీ చేశారు.
సులావేసి దీవి తీరప్రాంతంలో 7.5 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందని అధికారులు వెల్లడించారు. వేలాది మంది ప్రజలు నివాసాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. హోటళ్లు, ఆస్పత్రులను కూడా అధికారిక యంత్రాంగం ఖాళీ చేయించింది.
గోరాన్టా నగరానికి 85 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. సముద్రంలో 16 మైళ్ల లోతులో భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం అనంతరం భూమి 5.5, 5.1 తీవ్రతతో రెండుసార్లు ప్రకంపించిందని తెలిపింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|