|
| ఎల్టీటీఈ కీలక స్థావరానికి చేరువలో లంక దళాలు |
| కొలంబో (ఏజెన్సీ), సోమవారం, 17 నవంబర్ 2008 ( 16:49 IST ) | |
శ్రీలంక వైమానిక దళ యుద్ధవిమానాలు వేర్పాటువాద ఎల్టీటీఈ పేలుడు పదార్థాల నిల్వ కేంద్రంపై దాడి చేశాయి. ఇదిలా ఉంటే ఎల్టీటీఈకి చెందిన మరో కీలక స్థావరానికి శ్రీలంక దళాలు సమీపిస్తున్నాయని ఆర్మీ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. ఆదివారం రాత్రి 7.30, 11.00 గంటల సమయాల్లో శ్రీలంక యుద్ధవిమానాలు ఎల్టీటీఈ ఆయుధ కేంద్రంపై దాడులు చేశాయి.
ఈ దాడులు జరిగిన ప్రదేశం పలాయ్కు నైరుతీ దిశగా ఒక కిలోమీటరు దూరంలో ఉందని వైమానిక దళ ప్రతినిధి జనక నానాయక్కరా తెలిపారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ దళాలు కాండీ- జాఫ్నా హైవేపై కీలక వ్యూహాత్మక ప్రాంతమైన మాన్కులం జంక్షన్కు సమీపిస్తున్నాయని శ్రీలంక రక్షణ శాఖ తెలిపింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|