|
| శ్రీలంక దళాల చేతికి కీలక ఎల్టీటీఈ స్థావరం |
| కొలంబో (ఏజెన్సీ), శనివారం, 15 నవంబర్ 2008 ( 15:31 IST ) | |
శ్రీలంక భద్రతా దళాలు శనివారం ఉత్తర ప్రాంత వ్యూహాత్మక పట్టణం పూనెర్యాన్ను చేజిక్కించుకున్నాయి. దేశ పశ్చిమతీరంలో ఎల్టీటీఈకి పట్టు ఉన్న చివరి స్థావరం కూడా ఇదే. ఈ పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకోవడంతో శ్రీలంక దళాల జాఫ్నాలోకి ప్రవేశించి కీలకమైన భూమార్గాన్ని పొందాయి.
గత కొన్నివారాల పోరు అనంతరం ఎల్టీటీఈ తీవ్రవాదుల నుంచి ఈ పట్టణాన్ని శ్రీలంక భద్రతా దళాలు కైవసం చేసుకున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఎల్టీటీఈ పూనెర్యాన్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. శనివారం ఉదయం శ్రీలంక భద్రతా దళాలు పట్టణంలోకి అడుగుపెట్టాయని ఆర్మీ ప్రకటించింది.
ఎల్టీటీఈ రాజకీయ రాజధానిగా పేరొందిన కిళినోచ్చిని కూడా భద్రతా దళాలు సమీపిస్తున్నాయని ఆర్మీ తెలిపింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|