|
| ఎల్టీటీఈ రాజధానికి చేరువైన శ్రీలంక సైన్యం |
| కొలంబో (ఏజెన్సీ), శనివారం, 18 అక్టోబర్ 2008 ( 11:59 IST ) | |
శ్రీలంక ఉత్తర ప్రాంతంలో భీకర దాడులు కొనసాగిస్తున్న సైన్యం ఎల్టీటీఈ రాజధాని కిలినోచ్చికి మరింత చేరువైంది. ఆ పట్టణంలోని నచ్చికుదా స్థావరానికి ప్రధాన మార్గాన్ని స్తంభింపజేసిన సైన్యం దాని సమీపంలోని నేవీ స్థావరాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఎల్టీటీఈ ఓటమి అంచున ఉందని వెల్లడించింది. వాయువ్య తీరంలో ఎల్టీటీఈ బలంగా ఉన్న ప్రదేశాలన్నిటినీ తమ సైన్యం చుట్టుముట్టిందని తెలిపింది. కిలినోచ్చిలోని మనిక్కులం పట్టణాన్ని కూడా సైన్యం ఇప్పటికే స్వాధీనం చేసుకుందని తెలిపింది.
ఈ సందర్భంగా జరిగిన భీకర పోరులో చాలా మంది తమిళ పులులు చనిపోయారని వెల్లడించింది. వవునియాలోని నవత్కుళంలో ఓ ఎల్టీటీఈ శిబిరాన్ని ధ్వంసం చేయడంతో పాటు వేదమకుళంలోని పులుల స్థావరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - దక్షిణాది సినీ పరిశ్రమలో అతితక్కువ కాలంలో అగ్రశ్రేణి కథానాయికగా ఎదిగిన నటీమణుల్లో ఇలియానా... |
| |
|
|
|
|
|
|
|