|
| ఖాట్మండులో జర్మనీ దర్యాప్తు బృందం |
| ఖాట్మండు (ఏజెన్సీ), శుక్రవారం, 10 అక్టోబర్ 2008 ( 15:03 IST ) | |
నేపాల్లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంపై దర్యాప్తు జరిపే బృందంలో జర్మనీ విమానయాన శాఖ నిపుణులు కూడా వచ్చి చేరారు. ఎవరెస్ట్ శిఖరం సమీపంలోని లుక్లా ఎయిర్పోర్ట్ వద్ద ఈ హెలికాఫ్టర్ కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు నేపాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో 18 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
నేపాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల విచారణ కమిటీకి జర్మనీ నిపుణులు సాయం చేస్తారని శుక్రవారం అధికారులు తెలిపారు. బుధవారం యేటి ఎయిర్లైన్స్కు చెందిన ఈ ట్విన్ ఇంజిన్ హెలికాఫ్టర్ లుక్లా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా కూలిపోయింది. సరిగా కనిపించకపోవడం వలనే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.
ప్రమాదంలో మృతి చెందిన 18 మందిలో 12 మంది జర్మనీ పర్యాటకులు ఉన్నారు. మరో ఇద్దరు ఆస్ట్రేలియన్లు కాగా, మిగిలిన నలుగురు నేపాలీయులు. ఈ ప్రమాదం నుంచి హెలికాఫ్టర్ పైలెట్ ప్రాణాలతో బయటపడ్డాడు. పైలెట్ ప్రస్తుతం ఖాట్మండులోని త్రిభువన్ విశ్వవిద్యాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|