యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
స్వాత్ లోయలో పాక్ వైమానిక దళం దాడులు
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), గురువారం, 9 అక్టోబర్ 2008   ( 12:22 IST )
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక వాయువ్య ప్రాంతంలో ఒక తీవ్రవాద స్థావరంపై ఆ దేశ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్‌లు గురువారం దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రవాద స్థావరం పూర్తిగా ధ్వంసం అయిందని పాకిస్థాన్ అధికారులు తెలిపారు. ప్రాణనష్టం కూడా ఎక్కువగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

తీవ్రవాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న స్వాత్ లోయలోని పియోచార్ గ్రామంలో ఈ వైమానిక దాడి జరిగింది. గత ఏడాది నుంచి ఈ గ్రామంలోని తీవ్రవాద స్థావరంపై దాడులు జరుగుతూనే ఉండటం గమనార్హం. దాడిలో మృతి చెందిన తీవ్రవాదుల సంఖ్య ఇప్పుడే చెప్పలేమని పాక్ అధికారులు తెలిపారు. తీవ్రవాద స్థావరం పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ దాడి విజయవంతం అయిందని చెప్పారు.

పాకిస్థాన్‌లోని స్వాత్ లోయ ఒకప్పుడు అందమైన పర్యాటక ప్రాంతం. ఇప్పుడు అది తీవ్రవాదులకు అడ్డా. తాలిబాన్ మద్దతుదారుడైన మతపెద్ద మౌలానా ఫాజ్లుల్లా అతివాద ఇస్లామిక్ చట్టాలను ప్రవేశపెట్టడంతో ఈ ప్రాంతంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాలిబాన్లు, అల్‌ఖైదా తీవ్రవాదులకు ఈ ప్రాంతం స్వర్గధామంగా మారినట్టు పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాల కల్తీ: చైనాలో 10,700 బాలలకు అస్వస్థత
ఊపందుకున్న ఉ కొరియా క్షిపణి పరీక్షలు
అణు ఒప్పందం బిల్లుపై జార్జి బుష్ సంతకం
నేపాల్‌లో హెలికాఫ్టర్ కూలి 18 మంది మృతి
బేనజీర్ హత్యపై దర్యాప్తు జరపలేము: ఐరాస
థాయ్‌ ఉప ప్రధాని చావలిత్ రాజీనామా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...