|
| ఎన్ఎస్జీ: భారత్ అణు ఒప్పందానికి స్విస్ మద్దతు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008 ( 11:13 IST ) | |
అణు ఇంధన సరఫరా గ్రూపు (ఎన్ఎస్జీ) కీలక సమావేశం వచ్చే వారం జరగనున్న నేపథ్యంలో అమెరికాతో తాను కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందానికి భారత్ మరో దేశం మద్దతు సంపాదించగలిగింది. ఇతరదేశాలతో అణు వాణిజ్యం జరుపుకునేందుకు అణు ఇంధన సరఫరా గ్రూపు దేశాలు నుంచి భారత్ మినహాయింపు పొందాల్సిన సంగతి తెలిసిందే.
45 సభ్యదేశాలు కలిగిన ఎన్ఎస్జీలో స్విజ్జర్లాండ్ కూడా భారత్కు సానుకూలంగా ఓటు వేసే అవకాశముంది. ఈ విషయాన్ని స్విజ్జర్లాండ్ ఎగువ సభ స్పీకర్ క్రిస్టోఫెల్ బ్రాండిల్ పీటీఐతో చెప్పారు. అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం భారత ఇంధన భద్రతకు ఎంతో ముఖ్యమైనదని స్విజ్జర్లాండ్ భావిస్తోంది. ఈ కారణంగా భారత్ ఎన్ఎస్జీ మినహాయింపు పొందేందుకు అనుకూలంగా స్విజ్జర్లాండ్ ప్రభుత్వం ఓటు వేయనుందని బ్రాండిల్ తెలిపారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|