|
| నేపాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం |
| ఖట్మాండు (ఏజెన్సీ), 5 ఆగస్టు 2008 ( 17:42 IST ) | |
నేపాల్లో ఎన్నికలు జరిగిన నాలుగు నెలల తరువాత ప్రభుత్వం ఏర్పాటుకు నాలుగు ప్రధాన పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు అన్ని పార్టీలు అంగీకరించాయి. మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ఈ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో చాలా నిర్ణయాలు తీసుకున్నారు.
అయితే ఇంత వరకూ పార్టీల మధ్య కనీస ఉమ్మడి కార్యక్రమంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీపీఎన్-మావోయిస్ట్, నేపాల్ కాంగ్రెస్, సీపీఎన్-యూఎన్ఎల్, మాదేశీ పీపుల్స్ రైట్ ఫోరమ్లు సమావేశంలో పాల్గొన్నాయి. ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నాయి. మాజీ తిరుగుబాటుదారుల నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు నేపాలీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అర్జున్ నార్సింగా ఖట్రీ చట్రీ తెలిపారు.
మావోయిస్టులకు, మధ్యంతర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందాలనే అమలు జరపాలని నిర్ణయించారు. అన్ని పార్టీలు దాదాపు ఒకే నిర్ణయానికి వచ్చాయని చెప్పారు. కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ఖరారు చేసేందుకు అన్ని పార్టీల సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కమిటీనే నిర్ణయం తీసుకుంటుందన్నారు.
మావోయిస్టు పార్టీ రూపొందించిన 50 అంశాల కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని మిగిలిన మూడు పార్టీలు తిరస్కరించాయి. కొత్త ప్రతిపాదనలను మావోయిస్టు పార్టీ ఎదుట ఉంచాయి. కొత్త కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించేందుకు మావోయిస్టులు ఒప్పుకున్నారన్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|