|
| తీవ్రవాద వర్గాల మధ్య ఘర్షణ: పాక్లో 10మంది బలి |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), 19 జులై 2008 ( 12:48 IST ) | |
తీవ్రవాద వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పాక్లో పది మంది హతమయ్యారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాయువ్య పాకిస్థాన్లో చోటు చేసుకున్న ఈ భీకర కాల్పుల్లో పది నుంచి పదిహేనుమంది వరకు హతమయ్యారని ఆ వర్గాలు వెల్లడించాయి.
పాకిస్థాన్లోని తాలిబన్ నేత బైతుల్లా మెసూద్ మద్దతుదారులు, మొహ్మంద్ గిరిజన ప్రాంతంలోని చీలిక వర్గం మధ్య జరిగిన ఈ గొడవల్లో చాలామంది గాయపడ్డారని కూడా ఆ వర్గాలు వెల్లడించాయి.
మెసూద్ వర్గానికి చెందినట్టు తనను తాను చెప్పుకున్న డాక్టర్ ఆసాద్ కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తూ పదిహేను మంది తీవ్రవాదులను తాము హతమార్చడంతో పాటు మరో 120 మందిని బందీలుగా పట్టుకున్నామని తెలిపారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|