|
| ముగ్గురు భారతీయులకు కేంబ్రిడ్జి స్కాలర్షిప్పులు |
| లండన్ (ఏజెన్సీ), 19 జులై 2008 ( 11:00 IST ) | |
ఇద్దరు మహిళలు సహా ముగ్గురు ప్రతిబావంతులైన భారతీయులు ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ స్కాలర్షిప్పులకు ఎంపికయ్యారు. తమ మాజీ విద్యార్థి అయిన మన్మోహన్ సింగ్ గౌరవార్థం ఈ స్కాలర్షిప్పులను ఆ విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టింది.
ఈ స్కాలర్షిప్పులు అందుకోనున్న వారిలో కోల్కతకు చెందిన కాన్పూర్ ఐఐటీ విద్యార్థి నీలాద్రి బెనర్జీ (24), ఢిల్లీలోని ఓ అడ్మినిస్ట్రేషన్ స్కూల్లో పదేళ్లపాటు నిరుపేద విద్యార్థులతో కలిసి పనిచేసిన నీతూ దుగ్గల్ (31), లాహోర్ యూనివర్శిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ పరిశోధన విద్యార్థి మానసా పత్నం (24)లు ఉన్నారు.
తనకు అవార్డు దక్కడంపై బెనర్జీ హర్షం వ్యక్తం చేస్తూ న్యూటన్ చదివిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదవాలనే తనకోరిక నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. దుగ్గల్ మాట్లాడుతూ అంతర్జాతీయ సమాజం మద్య పనిచేయడం గొప్ప అనుభూతిని మిగల్చగలదని అభిప్రాయపడ్డారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|