|
| రేపు భారత్, బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శుల భేటి
|
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 17 జులై 2008 ( 13:08 IST ) | |
భారత్, బంగ్లాదేశ్ విదేశాంగ శాఖల కార్యదర్శలు శుక్రవారం ఇక్కడ సమావేశం కానున్నారు. దేశంలో జరుగుతున్న పలు తీవ్రవాద దాడుల్లో బంగ్లాదేశ్లో ఆశ్రయం పొందుతున్న సంస్థల ప్రమేయం ఉందని తెలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తీవ్రవాద సంస్థల పట్ల బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కఠినంగా వ్యవహరింప చేసేందుకు తాజా చర్చల ద్వారా భారత్ ప్రయత్నించనుంది.
ఇరుదేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశంలో తీవ్రవాదం పోరులో సహకారం ప్రధానాంశం కానుంది. తీవ్రవాదంతో పాటు సరిహద్దు నేరాలను అరికట్టడం, వాణిజ్య, ఆర్థిక సంబంధాలను ప్రోత్సహించడం తదితర అంశాలపై ఇరుదేశాలు ఈ సమావేశంలో చర్చలు జరుపుతాయి. అనేక తీవ్రవాదదాడుల్లో బంగ్లాదేశ్కు చెందిన సంస్థల ప్రమేయం ఉండటం దేశంలో ఆందోళన కలిగిస్తోంది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|