యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
సరబ్‌ శిక్షను యావజ్జీవంగా మార్చేందుకు పాక్ విముఖత
ఇస్లామాబాద్ (ఏజెన్సీ), 14 మే 2008   ( 15:16 IST )
పాకిస్థాన్‌లో ఉరిశిక్ష ఎదుర్కోబోతున్న భారతీయుడు సరబ్‌జీత్ సింగ్‌కు బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. సరబ్‌జీత్ సింగ్ మరణశిక్షను యావజ్జీయ శిక్షగా మార్చే అవకాశం లేదని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.

మరణశిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్చడం దేశంలో అరాచకాలను ప్రోత్సహించినట్టు అవుతుందని, ఇది దేశ విధానాలకు వ్యతిరేకమని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. శిక్షలను మార్చే ప్రతిపాదనను పాక్ ప్రభుత్వ ఉన్నతాధికారులు తీవ్రంగా వ్యతిరేకించారని అంతర్గత వ్యవహారాల శాఖ పేర్కొంది.

పాక్‌లో ఖైదీలందరి మరణశిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్చాలని కోరుతూ కొత్త ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సరబ్‌జీత్ కేసును కూడా పరిశీలించారు.

ఇందులో పాక్ విదేశాంగ శాఖ, అంతర్గత, న్యాయ, మానవహక్కుల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతర్గత వ్యవహారాల అంతర్గత వ్యవహారాల అదనపు కార్యదర్శి జఫీర్ అబ్బాసీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వర్జీనియా ప్రైమరీ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం
బీజింగ్ ఒలింపిక్స్‌పై భూకంప ప్రభావం ఉండదు: చైనా
జైపూర్‌లో బాంబు పేలుళ్లు: ప్రపంచ దేశాల ఖండన
పీపీపీ ప్రజాప్రతినిధులతో అసిఫ్ అలీ జర్దారీ సమావేశం
చైనా భూకంపం: 12 వేలకు చేరిన మృతుల సంఖ్య
పాక్ ప్రభుత్వానికి పీఎంఎల్- ఎన్ మంత్రుల రాజీనామా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...