|
| చైనా భూకంపం: 12 వేలకు చేరిన మృతుల సంఖ్య
|
| బీజింగ్ (ఏజెన్సీ), 14 మే 2008 ( 09:49 IST ) | |
నైరుతీ చైనాలోని సిచౌన్ ప్రావిన్స్లో సంభవించిన భారీ భూకంపం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 12 వేలకు చేరువయింది. సోమవారం సంభవించిన ఈ భూకంపంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చైనా ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ భూకంపం కేంద్రం ఉన్న వెన్చౌన్ కౌంటీకి చేరుకోవడం ఇప్పటికీ వీలుకాలేదని చైనా అధికారులు తెలిపారు.
రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయిన వెన్చౌన్ కౌంటీకి చేరుకునేందుకు చైనా సహాయక బృందాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. చైనా ప్రధానమంత్రి వెన్జిబావో సిచౌన్ ప్రావీన్స్లో పర్యటించారు. ఈ కష్టసమయంలో ప్రజలందరినీ ధైర్యంగా ఉండాలని కోరారు. మంగళవారం మధ్యాహ్నం 2.00 గంటల ప్రాంతంలో చైనా ప్రభుత్వం భూకంప మృతుల సంఖ్య 11,921కి చేరుకుందని ప్రకటించింది. ఇందులో 11,608 మంది సిచౌన్ ప్రావీన్స్లోనే మృతి చెందారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|