|
| పాక్ ప్రభుత్వానికి పీఎంఎల్- ఎన్ మంత్రుల రాజీనామా
|
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), 13 మే 2008 ( 16:58 IST ) | |
పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్- ఎన్) పార్టీకి చెందిన తొమ్మిది మంది మంత్రులు మంగళవారం పాక్ కొత్త సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశారు. పీఎంఎల్- ఎన్ మంత్రులు తొమ్మిది మంది తమ రాజీనామా లేఖలను ప్రధాని యూసఫ్ రజా గిలానీకి అందజేశారు. ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం లేదని రెండు పార్టీలు చెబుతున్నప్పటికీ తాజా పరిణామం ఎక్కడికి దారి తీస్తుందో వేచిచూడాల్సిందే.
న్యాయమూర్తుల పునర్నియాకంపై నెలకొన్న వివాదం పీఎంఎల్- ఎన్ మంత్రులు రాజీనామాలు చేయడానికి దారితీసింది. పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ గత ఏడాది తొలగించిన న్యాయమూర్తులను మళ్లీ నియమించడంపై పాక్ కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న పీపీపీ, దానికి మద్దతు ఇస్తున్న పీఎంఎల్- ఎన్కు మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.
న్యాయమూర్తుల పునర్నియామకంపై ఏకాభిప్రాయం కుదురకపోవడంతో ముందుగా హెచ్చరించిన ప్రకారం పాక్ మంత్రివర్గం నుంచి పీఎంఎల్- ఎన్ మంత్రులు బయటకువచ్చారు. ఇదిలా ఉంటే సమస్య పరిష్కారం కోసం పీఎంఎల్- ఎన్తో చర్చలు కొనసాగిస్తామని మంగళవారం పీపీపీ కో- ఛైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ తెలిపారు. పీఎంఎల్- ఎన్ తమను వీడిపోయే పరిస్థితి కల్పించమని జర్దారీ చెప్పారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|