యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
చైనా భూకంపం: ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు
బీజింగ్ (ఏజెన్సీ), మంగళవారం, 13 మే 2008   ( 15:44 IST )
పశ్చిమ చైనాలో భూకంపం సృష్టించిన భయానక పరిస్థితులను చెరపివేసేందుకు ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భూకంపం కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను చైనా ప్రభుత్వం ముమ్మరం చేసింది.

శిధిలాల కింద ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నవారిని వెలికితీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. చైనాలో సోమవారం 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం కారణంగా మరణించినవారి సంఖ్య మంగళవారానికి 10 వేలకు చేరుకుంది.

మృతుల సంఖ్య ఇంతకు రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి. మియాన్‌ఝు అనే నగరంలోనే సుమారు 10 వేల మంది మృతి చెందినట్లు వార్తలొచ్చాయి. ఈ భారీ భూకంపం కారణంగా నైరుతీ చైనాలో చాలాప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.

భూకంపం సంభవించిన చెంగ్దు కౌంటీకి వెళ్లడం ఇప్పటికీ వీలుపడలేదు. సుమారు 20 వేల మంది చైనా భద్రతా దళ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పలు నగరాల్లో భవనాలు కూలిపోవడం, రోడ్లు ధ్వంసం అవడంతోపాటు భూకంపం కారణంగా అపార ఆస్తినష్టం సంభవించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రక్షణ, మిలటరీ సంబంధాలపై భారత్, యూఏఈ చర్చలు
పాక్ ప్రభుత్వం నుంచి వైదొలగనున్న పీఎంఎల్- ఎన్ మంత్రులు
కీలక అంశాల్లో పురోభివృద్ధి సాధించాము: ప్రణబ్ ముఖర్జీ
ఇరాన్ శాంతియుత అణు కార్యక్రమానికి భారత్ మద్దతు
నైరుతి చైనా భూకంపం: 9వేలు దాటిన మృతుల సంఖ్య
లెబనాన్‌లో ఘర్షణలు: 11 మంది మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace