|
| పాక్ ప్రభుత్వం నుంచి వైదొలగనున్న పీఎంఎల్- ఎన్ మంత్రులు
|
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), మంగళవారం, 13 మే 2008 ( 11:59 IST ) | |
పాకిస్థాన్లో రెండు నెలల క్రితం ఏర్పాటయిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సోమవారం మొదటి ఎదురుదెబ్బ తగిలింది. న్యాయమూర్తుల పునర్నియామకం వివాదంపై ప్రభుత్వ భాగస్వాములైన పీపీపీ, పీఎంఎల్- ఎన్ మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.
పాక్ అధ్యక్షుడు ముషారఫ్ గత ఏడాది తొలగించిన న్యాయమూర్తులను పునర్నియమించాలని పీఎంఎల్- ఎన్ గట్టిగా పట్టుబడుతోంది. మే- 12లోగా ఇది జరగకపోతే ప్రభుత్వం నుంచి తమ మంత్రులు తప్పుకుంటారని ఇప్పటికే పీఎంఎల్- ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్ హెచ్చరించారు.
అనంతరం ఈ వివాదంపై పలుమార్లు పీపీపీ కో- ఛైర్మన్ అసిఫ్ అలీ జర్దారీతో షరీఫ్ చర్చలు జరిపినప్పటికీ ఆయన నుంచి విస్పష్టమైన హామీ లభించలేదు. దీంతో పీఎంఎల్- ఎన్ మంత్రులు పాక్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయించారు. పీఎంఎల్- ఎన్ మంత్రులందరూ మంగళవారం ప్రధాని యూసఫ్ రజా గిలానీకి రాజీనామా లేఖలు అందజేయనున్నారు.
మంత్రులు బయటకువచ్చినప్పటికీ పీపీపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని పీఎంఎల్- ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్ విలేకరులతో చెప్పారు. మార్చి 31న ప్రమాణస్వీకారం చేసిన 24 మంది సభ్యుల కొత్త మంత్రివర్గంలో పీఎంఎల్- ఎన్ పార్టీకి తొమ్మిది మంది మంత్రులున్నారు.
ఇదిలా ఉంటే షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్- ఎన్)తో న్యాయమూర్తుల పునర్నియామకంపై చర్చలు కొనసాగిస్తామని పీపీపీ తెలిపింది. మంత్రివర్గం నుంచి మంత్రులను ఉపసంహరించుకున్నప్పటికీ చర్చల ద్వారా న్యాయమూర్తుల పునర్నియామకంపై ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తామని పీపీపీ చెప్పింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|