|
| తూర్పు శ్రీలంక ఎన్నికల్లో అధికార కూటమి విజయం
|
| కొలంబో (ఏజెన్సీ), ఆదివారం, 11 మే 2008 ( 15:43 IST ) | |
శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స నేతృత్వంలోని అధికార కూటమి తూర్పు ప్రాదేశిక మండలి ఎన్నికల్లో 20 సీట్లు సాధించి విజయకేతనం ఎగురవేసింది. శ్రీలంక ఎన్నికల సంఘం తూర్పు ప్రాదేశిక మండలి ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడించింది.
ప్రధాన ప్రతిపక్షం యునైటెడ్ నేషనల్ పార్టీ ఈ ఎన్నికల్లో 15 సీట్లు గెలుచుకోగా, ప్రధాన వామపక్ష పార్టీ జేవీపీ (పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్) ఒక సీటు సాధించింది. తమిళ్ డెమొక్రటిక్ నేషనల్ అలయన్స్ ఒక సీటు గెలుచుకుందని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు.
శ్రీలంక తూర్పు ప్రాదేశిక మండళి ఎన్నికలు శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతాన్ని శ్రీలంక ప్రభుత్వ బలగాలు గత ఏడాది ఎల్టీటీఈ నుంచి స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఎన్నికలు జరగడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|