|
| జడ్జిల పునర్నియామకం: జర్దారీ, షరీఫ్ చర్చలు విఫలం
|
| లండన్ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008 ( 13:26 IST ) | |
పాకిస్థాన్లో ఇటీవల ఏర్పాటయిన సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాముల మధ్య శుక్రవారం జరిగిన కీలక చర్చలు జడ్జిల పునర్నియామకంపై నెలకొన్న వివాదానికి పరిష్కారం చూపలేకపోయాయి. పీపీపీ కో- ఛైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ, పీఎంఎల్- ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్లు న్యాయమూర్తుల పునర్నియామకంపై చర్చలు జరిపారు.
ఈ చర్చల్లో ఇరుపార్టీల అగ్రనేతలు జడ్జిల పునర్నియామకంపై ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. జర్దారీతో సమావేశం అనంతరం షరీఫ్ మాట్లాడుతూ పాకిస్థాన్లో అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్చే తొలగించబడిన న్యాయమూర్తులను మే- 12లోగా పునర్నియమించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.
న్యాయమూర్తుల పునర్నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు జర్దారీ మరింత సమయం కోరారు. దీనిపై తమ చర్చలు అసంపూర్తిగా ముగిశాయని షరీఫ్ తెలిపారు. గత ఏడాది ముషారఫ్ తొలగించిన న్యాయమూర్తులను గౌరవప్రదంగా తిరిగి వారి బాధ్యతల్లో నియమించాలని తాము కోరుకుంటున్నామన్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|