|
| భారత్-పాక్ సరిహద్దులో చొరబాటు యత్నం భగ్నం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008 ( 13:20 IST ) | |
భారత్-పాకిస్థాన్ సరిహద్దులో తీవ్రవాదులు చొరబాటుకు చేసిన యత్నాన్ని భగ్నం చేసినట్టు సరిహద్దు భద్రతా దళాలు తెలిపాయి. భారీ కాల్పుల మధ్య పాక్ సరిహద్దు నుంచి జమ్ము ప్రాంతంలోని సంబా భాగంలోకి చొరబడేందుకు తీవ్రవాదులు ప్రయత్నించారని భద్రతా దళాలు వెల్లడించాయి.
తీవ్రవాదులు వెయ్యి రౌండ్లు కాల్పులు జరిపి, 16 గ్రెనేడ్లను విసిరారని ఆ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటనలో భారత్ సరిహద్దు నుంచి ఎటువంటి మృతులకు సంబంధించిన వివరాలు అందలేదని ఆ వర్గాలు తెలిపాయి.
అలాగే పాక్ తీవ్రవాదులు నేరుగా ఈ సంఘటనలో పాల్గొన్నందుకు ఎటువంటి సాక్ష్యాలు లేవని భద్రతా దళాలు పేర్కొన్నాయి. కాగా దీనిపై సమావేశమై తాము నిరసన చేపట్టనున్నట్టు భద్రతా దళాలు తెలిపాయి.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|