|
| తక్షశిలలో రెండొవ శతాబ్దానికి చెందిన బుద్ధుని విగ్రహం
|
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), 19 మార్చి 2008 ( 16:27 IST ) | |
పాకిస్థాన్ పురాతత్వ శాస్త్రవేత్తలు చారిత్రక నగరమైన తక్షశిలలో 2000 సంవత్సరాల కిందటి బుద్ధుని విగ్రహాన్ని కనుగొన్నారు. ఎర్ర సున్నపురాయితో తయారు కాబడిన అరుదైన ఈ బుద్ధుని విగ్రహం 13 సెంటీమీటర్లు పొడవు, 12 సెంటీమీటర్ల వెడల్పు కలిగివుంది.
దీనిని క్రీస్తుశకం 2 శతబ్దానికి చెందిన విగ్రహంగా భావిస్తున్నారు. రెండు సింహాల సాయంతో ఉన్న సింహాసనంపై పద్మాసనంలో కూర్చొని ఉన్న బుద్ధుని విగ్రహంకు తమకు తక్షశిలలో లభించిందని బుధవారం పాక్ పురాతత్వ శాఖలోని పరిశోధనలు, అన్వేషణ విభాగ డైరెక్టర్ ముహమ్మద్ అష్రాఫ్ ఖాన్ తెలిపారు.
ఈ విగ్రహాన్ని ఈ శతాబ్ది ఆవిష్కరణగా ఆయన వర్ణించారు. తక్షశిల పురావస్తు ప్రదర్శనశాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బౌద్ధారామంలో ఈ విగ్రహాన్ని కనుగొన్నామని వెల్లడించారు. ఇది 2- 5 శతాబ్దాల మధ్యకాలానికి చెందినదిగా భావిస్తున్నామని చెప్పారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - చిత్ర సీమలో ప్రవేశించిన కొద్దికాలంలోనే ప్రేక్షకుల మధ్య తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న... |
| |
|
|
|
|
|
|
|