|
| లాసాలో 105 మంది అల్లరిమూకలు లొంగుబాటు: చైనా |
| బీజింగ్ (ఏజెన్సీ), బుధవారం, 19 మార్చి 2008 ( 15:34 IST ) | |
టిబెట్ రాజధాని లాసాలో 105 మంది అల్లరిమూకలు లొంగిపోయినట్టు చైనా ప్రకటించింది. మార్చి 14న లాసాలో చెలరేగిన ఘర్షణలకు వీరంతా బాధ్యులని చైనా ప్రభుత్వం పేర్కొంది. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రకటనల వల్లే వీరు రెచ్చి పోయారని చైనా విమర్శించింది.
ఈ విషయమై టిబెట్ ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ లాసాలో జరిగిన అల్లర్ల సందర్భంగా విధ్వంసానికి పాల్పడిన వారు లొంగిపోవడానికి గత సోమవారం రాత్రి వరకు గడువు విధించామని తెలిపారు. ఈ సమయంలో లొంగిపోయిన వారిని క్షమించి వదిలేందుకు ప్రయత్నిస్తామని, లేదంటే అట్టి వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం ప్రకటించినట్టు వారు చెప్పారు.
ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన కారణంగా వీరు లొంగిపోయారని వారు వివరించారు. లొంగిపోయిన వారు గొడవలు, ఆస్థులు తగలబెట్టడం, లూటీలు తదితర దుశ్చర్యల్లో పాల్గొన్నారని వారు తెలిపారు. వీరిలో కొందరు ఘర్షణల సందర్భంగా తాము లూటీ చేసిన ధనాన్ని కూడా అప్పగించారని వారు చెప్పారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - నివశించే గృహంలోని వివిధ గదులు ఉండాల్సిన దిక్కులు గురించి వాస్తు నిపుణులు అనేక రకాల... |
| |
|
|
|
|
|
|
|