|
| భద్రతా మండలి విస్తరణ: కొత్త ముసాయిదాకు తిరస్కృతి
|
| న్యూయార్క్ (ఏజెన్సీ), బుధవారం, 19 మార్చి 2008 ( 13:26 IST ) | |
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విస్తరణ కోసం తయారు చేసిన కొత్త ముసాయిదాను ఎక్కువ దేశాలు తిరస్కరించాయి. భద్రతా మండలి విస్తరణకు సంబంధించి ప్రతిపాదనలను పరిశీలించేందుకు 50 దేశాల ప్రతినిధులు సమావేశం కాగా, అందులో భారత్ సహా అనేక దేశాలు తాజా ముసాయిదాను అంగీకరించలేదు.
ఈ ముసాయిదా సారాంశంలో మండలి శాశ్వత సభ్యత్వంపై ఎటువంటి స్పష్టమైన సూత్రీకరణ లేదని భారత్ పేర్కొంది. మంగళవారం రాత్రి ఇక్కడ జరిగిన సమావేశంలో అనేక అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు భద్రతా మండలి విస్తరణపై తయారు చేసిన ముసాయిదాను పరిశీలించాయి.
అయితే ఈ ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా లేవని ఎక్కువ దేశాలు ముసాయిదాను తిరస్కరించాయి. భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ దేశాలతో ఏర్పాటయ్యే జీ- 4 కూటమికి స్థానం కేటాయించలేదని, అదేవిధంగా మండలి శాశ్వత సభ్యత్వ విస్తరణ సంబంధించిన అంశాలు కూడా లేవని భారత్ వెల్లడించింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - నివశించే గృహంలోని వివిధ గదులు ఉండాల్సిన దిక్కులు గురించి వాస్తు నిపుణులు అనేక రకాల... |
| |
|
|
|
|
|
|
|