|
| మలేషియా పార్లమెంటుకు భారత సంతతి ఎంపీలు ఎంపిక |
| కౌలాలంపూర్ (ఏజెన్సీ), బుధవారం, 19 మార్చి 2008 ( 13:08 IST ) | |
మలేషియాలో తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు భారత సంతతి నేతలకు కొత్త మంత్రి వర్గంలో చోటు లభించింది. వీరిలో ఒకరికి కేబినేట్ హోదా లభించగా ముగ్గురికి డిప్యుటీ మంత్రి పదవులు లభించాయి.
భారత్లోని తమిళనాడుకు చెందిన వీరిలో ఎస్. సుబ్రమణియన్కు మానవవనరుల శాఖ పదవి లభించింది. అలాగే ఎం. శరవణన్, దేవమణి, కోహిలన్ పిళ్లైలు వరసగా ఫెడరల్ టెరిటరీస్ శాఖ, ప్రధాని పేషీ, తోటల పరిశ్రమ శాఖల్లో డిఫ్యూటి మంత్రుల హోదా లభించింది.
మలేషియాలోని అధికార కూటమి బారిసాన్ నేషనల్ సంకీర్ణానికి ఈ ఎన్నికల్లో సాధారణ విజయం మాత్రమే లభించింది. దీంతో ప్రధాని అబ్దుల్లా బదావీ మంత్రి పదవుల ఎంపికలో అత్యంత జాగ్రత్త వహించినట్టుగా మలేషియా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
గతంలో మలేషియా పార్లమెంటులో మూడింట రెండోంతుల మెజారిటీతో తిరుగులేని ఆధికారాన్ని చెలాయించిన అధికార కూటమి ప్రస్తుత ఎన్నికల్లో సాధారణ మెజారిటీ మాత్రమే సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో బారిసాన్ కూటమి పార్టీలు నాలుగు రాష్ట్రాల్లో పూర్తిగా ఓడిపోవడం గమనార్హం.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - నివశించే గృహంలోని వివిధ గదులు ఉండాల్సిన దిక్కులు గురించి వాస్తు నిపుణులు అనేక రకాల... |
| |
|
|
|
|
|
|
|