|
| ఆహార భద్రతకు రూ.1 లక్ష కోట్ల సబ్సిడీ అవసరం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009 ( 12:14 IST ) | |
ఢిల్లీ పీఠాన్ని తిరిగి అధిష్టించబోతున్న యూపీఏ కూటమి ప్రభుత్వం వచ్చే ఐదేళ్ల కాలంలో ఆహార భద్రతా కార్యక్రమానికి రూ.1 లక్ష కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న దేశ ప్రజలందరికీ నెలకు రూ.3లకే 25 కేజీల గోధుమ లేదా బియ్యం సరఫరా చేస్తామని యూపీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
దీనిని అమలు చేసేందుకు యూపీఏ కూటమి ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.1 లక్ష కోట్లు వ్యయం చేయాల్సిన అవసరం ఉంది. గ్రామీణ, పట్టణ రెండు ప్రాంతాల్లోని పేదలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8.13 కోట్ల పేద కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కుటుంబాలన్నింటికీ తెల్లకార్డులు మంజూరు చేశాయి. ప్రతి ఏటా ఈ పథకాన్ని అమలు చేసేందుకు 243.9 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అవసరమవతాయి.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|