|
| ఎల్ అండ్ టీ యూనిట్కు రూ.500 కోట్ల ఆర్డర్లు |
| ముంబయి (ఏజెన్సీ), మంగళవారం, 19 మే 2009 ( 17:02 IST ) | |
ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ ఒమన్ యూనిట్ ఆ దేశంలో రూ.518.2 కోట్ల విలువైన మూడు ఆర్డర్లు దక్కించుకుంది. ఈ విషయాన్ని ఎల్ అండ్ టీ మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)కి తెలియజేసింది. ఒమన్లో విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులను తమ యూనిట్ సొంతం చేసుకుందని ఎల్ అండ్ టీ తెలిపింది.
ఎల్ అండ్ టీ ఇంటర్నేషనల్ ఎఫ్జెడ్ఈలో భాగమైన ఎల్ అండ్ టీ (ఒమన్) ఎల్ఎల్సీ ఈ ఆర్డర్లు పొందింది. ఒమన్లోని వ్యాపార దిగ్గజాల్లో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. దీనిని ఎల్ అండ్ టీ ఎఫ్జెడ్ఈ, ది మస్కట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఎల్ఎల్సీలు కలిసి ఏర్పాటు చేశాయి.
రూరల్ ఎరియాస్ ఎలక్ట్రసిటీ కంపెనీ, ఒమన్ ఎలక్ట్రసిటీ ట్రాన్మిషన్ కంపెనీ, ఒమన్ టూరిజం డెవెలప్మెంట్ కంపెనీల నుంచి ఎల్ అండ్ టీ ఒమన్ ఎల్ఎల్సీ ఈ ఆర్డర్లు కైవసం చేసుకుంది. తాజా ప్రాజెక్టులను కంపెనీ వచ్చే 20 నెలల కాలంలో పూర్తి చేయనుందని ఎల్ అండ్ టీ వెల్లడించింది.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|