యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
త్వరలో ఇంధన ధరల తగ్గింపు: డియోరా
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 7 జనవరి 2009   ( 17:11 IST )
కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశంలో ఇంధన ధరలను మరోసారి తగ్గించనుందని పెట్రోలియం శాఖ మంత్రి మురళీ డియోరా బుధవారం వెల్లడించారు. పెట్రోలు, డీజిల్ ధరలతోపాటు, ఎల్‌పీజీ సిలిండర్ ధరలోనూ తగ్గింపు ఉండవచ్చని ఆయన చెప్పారు.

వచ్చే రెండు, మూడు వారాల్లో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపును ప్రకటించే అవకాశముందని డియోరా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో అన్నారు. అయితే తగ్గింపు ఏ స్థాయిలో ఉంటుందనే దానిపై, ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

వంట గ్యాసు ధరలపై డియోరా మాట్లాడుతూ.. సిలిండర్ అమ్మకాలపై ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని, అయినప్పటికీ సిలిండర్‌పై రూ.20-25 వరకు తగ్గింపు ఉండవచ్చని సూచనప్రాయంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చివరిసారి డిసెంబరు- 5, 2008న ఇంధన ధరలను తగ్గించింది.

ఆ సమయంలో పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై లీటరుకు రూ. 2 తగ్గింపును కేంద్రం ప్రకటించింది. ఎల్‌పీజీ ధరలను మాత్రం స్థిరంగా ఉంచింది. అనంతరం అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత పతనమైన బ్యారెల్ ముడిచమురు ధర ప్రస్తుతం బ్యారెల్ 50 డాలర్ల వద్ద ఉంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆర్థిక సంక్షోభం: జర్మనీ బిలియనీర్ మెర్క్లే ఆత్మహత్య
విమాన సర్వీసులపై అధికారుల సమ్మె ప్రభావం
సత్యం కంప్యూటర్ ఛైర్మన్ రామలింగరాజు రాజీనామా
ఒడిదుడుకులతో ముగిసిన స్టాక్ మార్కెట్
ఎయిర్‌టెల్, రిమ్‌ల నుంచి బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు
గోవాను తాకిన ఆర్థిక సంక్షోభం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...