|
| త్వరలో లెనోవా డ్యూయెల్ స్క్రీన్ నోట్బుక్ |
ప్రముఖ అంతర్జాతీయ ల్యాప్టాప్ తయారీ సంస్థ లెనొవా గ్రూప్ కంపెనీ త్వరలో డ్యూయెల్ స్క్రీన్ నోట్బుక్లను విడుదల చేయనుంది. దీంతో పాటు సరికొత్త పర్సనల్ కంప్యూటర్లను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త మోడళ్లు లాస్వెగాస్లో ఈ వారంలో జరిగే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ప్రదర్శన (సీఈఎస్)లో దర్శనమివ్వనున్నాయి.
ఆర్థిక సంక్షోభం కారణంగా పీసీలకు డిమాండ్ తగ్గినప్పటికీ, నోట్బుక్ల శ్రేణి బాగా పుంజుకుంటోంది. అందుకే పర్సనల్ కంప్యూటర్ల తయారీలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న లెనోవా ప్రస్తుతం వీటిని విడుదల చేస్తోంది. థింక్పాడ్ మార్కెటింగ్ మేనేజర్ వెస్ విలియమ్స్ మాట్లాడుతూ, వ్యాపరస్తులకు డ్యూయెల్ స్క్రీన్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
ఏదిఏమైనప్పటికీ, కొత్త ల్యాప్టాప్లు తక్కువ బరువుతో, తక్కువ ధరలో (11 పౌండ్ల బరువు, 3,600 డాలర్లు) లభించనున్నాయన్నారు. చైనా కేంద్రంగా పని చేస్తున్న లెనోవా 2005లో ఐబీఎం పీసీల వ్యాపారాన్ని చేజిక్కించుకుంది. కాగా, పీసీల ప్రపంచంలో హెవ్లెట్-ప్యాకార్డ్ అగ్ర స్థానంలో ఉండగా, డెల్, ఏసర్లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|