|
| నష్టాల బాటలో సెన్సెక్స్: 82 పాయింట్ల పతనం |
| మంగళవారం, 2 డిసెంబర్ 2008 ( 16:11 IST ) | |
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) మంగళవారం నష్టాల బాటలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో 304 పాయింట్ల భారీ పతనంతో 8,536 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, అనంతరం కూడా నష్టాల్లోనే కొనసాగుతూ ఒకానొక దశలో 8,467 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది.
సాయంత్రం ముగింపు సమయానికి కోలుకున్న బీఎస్ఈ సూచి 82 పాయింట్ల నష్టంతో 8758 వద్ద స్థిరపడింది. ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా ఈ రోజు నష్టాల్లోనే నడిచింది. నిఫ్టీ ముగింపు సమయానికి 48 పాయింట్లు కోల్పోయి 2635 వద్ద నిలిచింది.
మార్కెట్ లావాదేవీల్లో ఏబీబీ వాటాలు 4.55 శాతం. ఏబీజీ షిప్యార్డ్ వాటాలు 4.85 శాతం, యాడ్లాబ్స్ ఫిల్మ్స్ వాటాలు 1.7 శాతం, స్టెర్లైట్ వాటాలు 6.51 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా వాటాలు 6.34 శాతం, మారుతీ ఉద్యోగ్ వాటాలు 5.87 శాతం నష్టపోగా, అలహాబాద్ బ్యాంకు వాటాలు 0.3 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటాలు 2.1 శాతం, గ్రాసిం వాటాలు 0.35 శాతం లాభపడ్డాయి.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|