|
| నష్టాల బాటలో సెన్సెక్స్: 163 పాయింట్ల పతనం |
| ముంబయి (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008 ( 17:00 IST ) | |
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం నష్టాల బాటలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో 34 పాయింట్లు వృద్ధి చెంది 8,971 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, అనంతరం కూడా కొంతసేపు లాభాల్లోనే కొనసాగింది. ఒకానొక దశలో క్రితం ముగింపుతో పోలిస్తే 299 పాయింట్లు వృద్ధి చెంది 9,236 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది.
బ్యాంకింగ్, సాంకేతిక తదితర రంగాల వాటాలు బలహీనపడటంతో నష్టాల్లోకి అడుగుపెట్టిన బీఎస్ఈ సూచి ముగింపు సమయానికి 163 పాయింట్లు కోల్పోయి 8,774 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా ఈ రోజు నష్టాల్లోనే పయనించింది. నిఫ్టీ ముగింపు సమయానికి 48 పాయింట్లు కోల్పోయి 2635 వద్ద నిలిచింది.
మార్కెట్ లావాదేవీల్లో జైప్రకాశ్ అసోసియేట్స్ వాటాలు 6 శాతం, హిందాల్కో వాటాలు 5 శాతం, గ్రాసిం వాటాలు 4.6 శాతం, ఎల్ అండ్ టీ వాటాలు 4 శాతం, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు వాటాలు 3.7 శాతం నష్టపోయాయి. ఐటీసీ వాటాలు 3 శాతం లాభపడగా, రాన్బాక్సీ వాటాలు 2 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా వాటాలు 1 శాతం పుంజుకున్నాయి.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|