|
| చమురు కంపెనీల ఉద్యోగుల సమ్మె వాయిదా |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 18 నవంబర్ 2008 ( 11:42 IST ) | |
ప్రభుత్వ రంగ చమురు కంపెనీల ఉద్యోగులచే ప్రతిపాదించబడిన సమ్మె వారం రోజులపాటు వాయిదా పడింది. మంగళవారం ప్రభుత్వ రంగ చమురు కంపెనీల ఉద్యోగులు సమ్మె చేపట్టాలని భావించిన సంగతి తెలిసిందే. వేతనాల పెంపును డిమాండ్ చేస్తూ వారు ఈ సమ్మెకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ రంగ ఉద్యోగుల వేతన పెంపు ప్రతిపాదనను పరిగణలోకి తీసుకునేందుకు కేంద్ర మంత్రి ఈ నెల 20న సమావేశం కానున్న నేపథ్యంలో, సమ్మెను వారం రోజులపాటు వాయిదా వేశామని చమురు రంగ అధికారుల సంఘం (ఓఎస్ఓఏ) అధ్యక్షుడు అమిత్ కుమార్ వెల్లడించారు.
అంతకుముందు 14 ప్రభుత్వ రంగ చమురు కంపెనీల్లో పనిచేస్తున్న 50 వేల మంది అధికారులు మంగళవారం నుంచి సమ్మెకు దిగుతారని ఓఎస్ఓఎస్ ప్రకటించింది. జనవరి- 2007లో జరగాల్సిన వేతన సవరణ వాయిదా పడుతుండటంపై వారు సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|