|
| భారత్లో ఆగస్టు 22 నుంచి యాపిల్ ఐఫోన్ అమ్మకాలు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 7 ఆగస్టు 2008 ( 11:28 IST ) | |
యాపిల్ తయారు చేసిన ఐఫోన్ ఈ నెల 22 నుంచి భారత వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అమెరికా మార్కెట్లో, ఇతర పశ్చిమదేశాల్లో సంచలనం సృష్టించిన ఈ ఐఫోన్ భారత మొబైల్ వినియోగదారులకు కూడా చేరువకాబోతుంది. దేశంలో ప్రైవేట్ టెలికాం సంస్థలైన వోడాఫోన్, భారతీ ఎయిర్టెల్లు ఈ ఫోన్ను ఆగస్టు 22 నుంచి విక్రయించనున్నాయి.
మిలియన్ల సంఖ్యలో ఉన్న తమ ఖాతాదారులకు ఈ టచ్స్క్రీన్ మొబైల్ ఫోన్ను పరిచయం చేసేందుకు ఎయిర్టెల్, వోడాఫోన్ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ సంస్థల రిటైల్ కౌంటర్లలో యాపిల్ ఐఫోన్ విక్రయాలు జరుగుతాయి. దేశంలో ప్రస్తుతం వోడాఫోన్కు 49 మిలియన్ల మంది ఖాతాదారులు ఉండగా, ఎయిర్టెల్కు 69 మిలియన్ల మంది ఖాతాదారులు ఉన్నారు.
| | (మూలం - వెబ్దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|